http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 17 April 2015

On 18:01 by Unknown   No comments
ఇటీవల అక్కినేని  ఫ్యామిలీపై అనేక పుకార్లు వస్తున్నాయి. తాజాగా వచ్చిన పుకార్లపై అక్కినేని నాగార్జున స్పందించారు. తమపై వస్తున్న వార్తలు అన్ని ఒట్టి పుకార్లే అంటూ నాగార్జున స్పష్టంచేశారు. అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన 'మనం' సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చిన విషయం తెలిసిందే. 
 
దీంతో నాగార్జున త్వరలో 'మనం' పేరుతో ఓ టీవీ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు మీడియాలో వార్తలు వెల్లడైయ్యాయి. అయితే ఈ వార్తలన్నీ కేవలం పుకార్లే అని నాగార్జున కొట్టిపారేశారు. ఈ వార్తలపై స్పందించిన నాగార్జున తాను 'మనం' పేరుతో ఓ టీవీ ఛానల్ పెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ తప్పుడు వార్తలే అని ట్విట్టర్‌లో తెలిపారు. 
 
కాగా నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా విడుదలకి సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. 
 
అదేవిధంగా పివిపి బ్యానర్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాలో హీరో కార్తి తో పాతునగార్జున ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov