info
Thursday, 27 August 2015
On 02:00 by Unknown No comments
శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణ
పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" అంటారు. దీన్నే రాఖీ లేఖ రక్షాబంధన్ పండుగగా
కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాచెలెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య
ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉత్తర, పశ్చిమ
భారతదేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో
ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ఈ
పండుగ రోజున జంధ్యాలు ధరించే వారు నూతన జంధ్యాలు ధరిస్తారు. ఇదే రోజున
బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేద పఠనం
ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే.. ఆ వృత్తిని
ప్రారంభించడం, ప్రారంభఋక్కును - చివరిఋక్కును ఇదే రోజున పఠించడం చేస్తారు.
ఈ విధంగా కాలక్రమంలో "రక్షాబంధన్ లేక రాఖీ"
పండుగగా ప్రాచుర్యం పొందిన శ్రావణ పూర్ణిమ నాడు ఈ దిగువ మంత్రాన్ని
పఠిస్తూ సోదరి - సోదరునకు, భార్య - భర్తకు ఈ రక్షాబంధన కడుతువుంటారు.
పూర్వం యుద్ధానికి వెళ్ళే వీరునికి విజయం ప్రాప్తించాలని ఆశిస్తూ ఈ
రక్షాబంధనను కట్టే వారని పురాణాలు చెబుతున్నాయి.
"యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః|
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల||"
శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన
బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా! నీవు చలించక వీనికి రక్షణ
కల్పించుము అని మంత్రార్థం.
ఇక.. రక్షాబంధన్ ఎలా ప్రారంభమైనది అంటే..?
పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో
ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని
కూడగట్టుకుని 'అమరావతి'లో తలదాచుకుంటాడు.
అట్టి భర్త నిస్సహాయతను గమనించిన ఇంద్రాణి
'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు
'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు
'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత
'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా"
దేవేంద్రుని చేతికి కడుతుంది.
అది గమనించిన దేవతలందరు వారు పూజించిన
రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయయాత్రకు అండగా నిలచి, తిరిగి
'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ
రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగగా ఆచారమైందని పురాణాలు
చెబుతున్నాయి.
ఇంకా రాఖీకి గల పవిత్రత ఏమిటంటే..? భార్య -
భర్తకు, సోదరి - సోదరులకు కట్టే రక్షాబంధన్ ద్వారా వారు తలపెట్టే కార్యాలు
విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మానమర్యాదలకు సోదరుడు/భర్త బాసటగా
నిలవాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ 'రాఖీ'. అలా రాఖీలు కట్టించుకున్న
భర్తలు, సోదరులు వారికి నూతన వస్త్రాలు, చిరు కానుకలు సమర్పించి, అందరు
కలసి చక్కని విందు సేవిస్తారు.
ఇదిలావుంటే... పూర్వం విదేశీయులు మన
దేశాన్ని పాలిస్తున్న రోజులలో మొగలాయుల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం
అడ్డూఅపూ అనేది లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది.
స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వారికి
'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావంతో, రక్షణ పొందేవారు.
ఒకసారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన
దుర్గాన్ని ముట్టడించినప్పుడు 'ఢిల్లీపాదుషాకు' రాఖీ పంపగా ఆమెను సోదరిగా
భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట పాదుషా భగినీ హస్తభోజనం చేసి,
కానుకలు సమర్పించినట్లు గాథలు ఉన్నాయి.
అట్టి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ,
మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగను అమితానందంతో జరుపుకుందాం. మరి సోదరీ,
సోదరులకు రాఖీ శుభాకాంక్షలు...
Subscribe to:
Post Comments (Atom)
Search
-
అమెజాన్ డిస్కౌంట్ అమ్మకానికి ఈ లింక్ క్లిక్ చేయండి Click this link for Amazon Discount Sales https://whatyourbuy.in/amazon-discount-finde...
-
ఎన్టీఆర్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. టెంపర్ సక్సెస్ ఇచ్చిన జోష్ మన నందమూరి వారసుడిమ...
-
In today's Presidential election, 4,895 legislators across the country - parliamentarians and legislators - voted. The National Democr...
-
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ తాజా ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా ...
-
పబ్లిసిటీకి డిఫరెంట్ ఐడియాలను అప్లై చేస్తున్నారు మూవీ మేకర్స్. కొలవెరి తర్వాత ఈ...
-
విజయవాడ: నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని ఇళ్ల నుంచి పారిపోయి వ...
-
Amazon is continuing its international expansion push with the launch of its services in Singapore coming imminently. The arrival could ...
-
హైదరాబాద్: సీన్ డిమాండ్ చేసింది, అందుకే లిప్ లాక్ ముద్దు సీన్లో నటించాల్సి వచ్చింది.....దీన్ని ఇంత పెద్ద రాద్దాంతం చేస్తారేమిటి? అంటూ బాల...
-
రుద్రమదేవి..సెప్టెంబర్ నాలుగున విడుదల కావాల్సిన సినిమా. అనివార్య కార...
-
యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'రేయ్' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ పలు కట్స్ ఇచ్చినట్టు తెలుస...
Akshith Nihaal. Powered by Blogger.
0 comments:
Post a Comment