http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 23 March 2015

On 17:54 by Unknown   No comments
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ లింగా చిత్ర సమస్య నుంచి బయటపడీపడగానే, మరో సమస్య ఆయన్ను ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే ‘లింగ’ వివాదంలో చిక్కుకుని, సొంత డబ్బు ఖర్చు పెట్టి బయటపడ్డ రజనీని తాజాగా కొచ్చడయాన్‌కు సాయం చేసిన ఏడీ బ్యూరో అనే సంస్థ చికాకుపెడుతోంది. 
 
కొచ్చడయాన్ విడుదల సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న మీడియా వన్ కు రజనీ భార్య లత హామీ మేరకు తాము రూ.10 కోట్లిచ్చామని ఏడీ బ్యూరో అధినేత అభిర్ చంద్ నహార్ చెబుతున్నారు. ఆ తర్వాత తమకు తెలియకుండానే, ఆ చిత్ర తమిళనాడు హక్కులను మీడియా వన్ రెట్టింపు ధరకు అమ్ముకుందని ఆయన ఆరోపిస్తున్నారు. 
 
ఈ విషయంలో రజనీకాంత్ కల్పించుకుని తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఇదిలా ఉంటే, మీడియా వన్ ముఖ్య అధికారి జయకుమార్, ఏడీ బ్యూరో ఆరోపణలను ఖండించారు. తాము తీసుకున్న అప్పులో ఇప్పటికే రూ.9 కోట్ల మేర చెల్లించామని, నహార్ అధిక వడ్డీ ఆశిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని జయకుమార్ చెబుతున్నారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov