http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 23 March 2015

On 17:59 by Unknown   No comments
కాళిదాసు, కరెంట్‌, అడ్డా చిత్రాల తర్వాత సుశాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉగాదినాడు లాంఛనంగా ప్రారంభమైంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నిర్మిస్తున్నారు. నాగార్జున పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ను దర్శకుడు నాగేశ్వరరెడ్డికి అందించారు. నాగచైతన్య క్లాప్‌నివ్వగా, అఖిల్‌ అక్కినేని కెమెరా స్విచ్చాన్‌ చెయ్యగా, సుమంత్‌ తొలి షాట్‌కి దర్శకత్వం వహించగా హీరో సుశాంత్‌ 'అందరికీ ఉగాది శుభాకాంక్షలు' అన్న డైలాగ్‌ చెప్పడాన్ని ముహూర్తం షాట్‌గా చిత్రీకరించారు.
 
నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ''ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో భారీ ఎత్తున నిర్మిస్తున్నాం. శ్రీధర్‌ సీపాన చక్కటి కథ ఇచ్చారు. ఏప్రిల్‌ 10 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ప్రారంభం రోజునే నైజాం, సీడెడ్‌ ఏరియాలు బిజినెస్‌ అవడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్‌ సీపాన, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, కళ: నారాయణరెడ్డి, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov