http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 29 September 2015

On 05:15 by Unknown   No comments
‘శ్రీమంతుడు’ సినిమాలో మాదిరిగాఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తన మాట నిలుపుకొన్నారు. పాలమూరు జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ను దత్తత తీసుకుంటున్నట్లు.. ట్విట్టర్లో తెలిపారు. ఏసీబీ డైరెక్టర్‌ ఎంఎ ఖాన్‌ కూడా పాలమూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 2వేల గ్రామాలను పలువురు ప్రముఖులు దత్తత తీసుకున్నారు.
ఇదీ సిద్ధాపూర్‌: కొత్తూర్‌ మండల కేంద్రానికి మారుమూల ప్రాంతమైన సిద్ధాపూర్‌ జనాభా 3వేలు. 720 కుటుంబాలు, 2వేల మంది ఓటర్లు ఉన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో వైఎం తండా, పులిచర్లకుంట తండా, చింతగట్టు తండాలు ఉన్నాయి. తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్‌బాబుకు, మంత్రి కేటీఆర్‌కు షాద్‌నగర్‌ ఎమ్మెలే అంజయ్య యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలియటంతో.. సిద్ధాపూర్‌ గ్రామస్తులు ఆనందంతో మహేశ్‌బాబు ఫ్లెక్సీలతో ఊరేగింపు నిర్వహించారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov