http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 19 July 2017

On 19:52 by Unknown   No comments
సీనియర్‌ నటుడు జగపతిబాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘పటేల్‌ సర్‌’. ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మించినప్పటికీ ఆ ప్రాజెక్టులో జగపతిబాబు కూడా డబ్బులు పెట్టారట. అలాగే ఈ సినిమాలో నటించినందుకు రెమ్యునరేషన్‌ కూడా తీసుకోలేదట. దీనికి కారణం కథపై ఉన్న నమ్మకమే. హాంకాంగ్‌ సినిమా ‘వెంజియాన్స్‌’ ఆధారంగా ‘పటేల్‌ సర్‌’ సినిమాను తెరకెక్కించారు. అయితే అది తెలుగు ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో రీచ్‌ అవలేదు. దీంతో సినిమా పరాజయం పాలైంది. దీంతో జగపతి బాబు నష్టాలను చవిచూశారట. గతంలో కొన్ని అలవాట్ల వల్ల డబ్బు పోగొట్టుకుని అప్పులపాలయ్యారు జగపతిబాబు. అయితే విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టర్న్‌ తీసుకోవడంతో ఆయనకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ అగ్రహీరోల సినిమాల్లో కూడా విలన్‌గా నటిస్తున్నారు జగపతి. ఈ టైమ్‌లో హీరోగా తన లక్‌ పరీక్షించుకుందామని చేసిన ప్రయత్నం దెబ్బకొట్టింది. 

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov