http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 26 July 2017

On 20:06 by Unknown   No comments
     వెబ్ డెస్క్‌ :  ప్రమాణస్వీకారం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసిన తొలి ప్రసంగంపై విపక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం రాజ్యసభలో ఈ అంశంపై విపక్షాలు, అధికార పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ పేరు ప్రస్తావించకుండా రాష్ట్రపతి కోవింద్‌ తన తొలి ప్రసంగం చేశారంటూ కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ విమర్శించారు. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.
‘దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో కృషి చేసిన వారిని కొనియాడటం భారత్‌లో ఉన్న సంప్రదాయం. ఈ పోరాటంలో నెహ్రూ జైలుకు కూడా వెళ్లారు. అటువంటి వ్యక్తి పేరును రాష్ట్రపతి కోవింద్‌ ప్రస్తావించలేదు’ అని శర్మ రాజ్యసభలో ప్రసంగిస్తూ అన్నారు. శర్మ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శర్మ ప్రసంగాన్ని మొత్తం రికార్డుల్లో నుంచి తొలగించాలని జైట్లీ కోరారు. ‘మీరు ఎందుకోసం ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారో మాకు తెలుసు. మీడియా దృష్టిలో పడేందుకే మీరు ఇలా చేస్తున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov