info
Friday, 28 July 2017
On 13:48 by Unknown No comments
హైదరాబాద్: సిట్ విచారణకు హజరైన టాలీవుడ్ నటి ముమైత్ఖాన్ నుండి పలు కీలక విషయాలను రాబట్టేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నించారు.అయితే ఈ విషయంలో వారు కొంత సఫలమయ్యారు. అయితే పబ్లు, క్లబ్లకు వెళ్ళే విషయాలపై ఆమెను ప్రశ్నించిన సమయంలో ఆమె దిమ్మతిరిగే సమాధానాన్ని సిట్ అధికారులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. సీసీ పుటేజీలను పరిశీలించుకోవాలని ఆమె సవాల్ చేసినట్టు తెలిసింది.
సినీ పరిశ్రమకు చెందిన కొందరికి కెల్విన్తో సంబంధాలున్నాయనే విషయమై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు.ఈ మేరకు ఈ నెల 19వ, తేదినుండి ఈ విచారణ సాగుతోంది. అయితే శుక్రవారంతో ఈ విచారణ ముగిసే అవకాశాలున్నాయి.
మరో వైపు ఇప్పటివరకు విచారణకు హజరైన సినీ ప్రముఖులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిని కూడ విచారించేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలను చేస్తున్నారు. విచారణకు హజరైన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడ కొన్ని అరెస్టులు చేశారు.
అయితే రానున్న రోజుల్లో ఇంకా కొందరిని విచారించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాన్ని ఎక్సైజ్ అధికారులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. రెండో దశ విచారణకు సంబంధించి ఇంకా నోటీసులు మాత్రం జారీ చేయలేదు. అయితే కమింగను మరోసారి విచారించిన తర్వాత ఈ నోటీసులు జారీచేస్తారా లేక అంతకంటే ముందే నోటీసులు జారీచేస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సినీ పరిశ్రమకు చెందిన కొందరికి కెల్విన్తో సంబంధాలున్నాయనే విషయమై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు.ఈ మేరకు ఈ నెల 19వ, తేదినుండి ఈ విచారణ సాగుతోంది. అయితే శుక్రవారంతో ఈ విచారణ ముగిసే అవకాశాలున్నాయి.
మరో వైపు ఇప్పటివరకు విచారణకు హజరైన సినీ ప్రముఖులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిని కూడ విచారించేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలను చేస్తున్నారు. విచారణకు హజరైన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడ కొన్ని అరెస్టులు చేశారు.
అయితే రానున్న రోజుల్లో ఇంకా కొందరిని విచారించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాన్ని ఎక్సైజ్ అధికారులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. రెండో దశ విచారణకు సంబంధించి ఇంకా నోటీసులు మాత్రం జారీ చేయలేదు. అయితే కమింగను మరోసారి విచారించిన తర్వాత ఈ నోటీసులు జారీచేస్తారా లేక అంతకంటే ముందే నోటీసులు జారీచేస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సీసీటీవి పుటేజీలు పరిశీలించండి
హైద్రాబాద్లో ఉన్న సమయంలో ఎక్కువ కాలం పబ్లోనే గడిపేవారని, ఆ సందర్భంగానే డ్రగ్స్ అలవాటు చేసుకొన్నారా అని ముమైత్ను సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. అయితే ఈ విషయమై సిట్ అధికారులకు ముమైత్ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. పబ్లకు వెళ్తాను కానీ, డ్రగ్స్ అలవాటు లేదని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే సీసీటీవి పుటేజీని పరిశీలించుకోవాలని ఆమె సిట్ అధికారులకు కౌంటర్ ఇచ్చింది.
కొత్త ప్రాంతాలను చూడాలనేది హబీ
కొత్త ప్రాంతాలను చూడాలనేది తన హబీ అని ముమైత్ఖాన్ సిట్ అధికారులకు విచారణ సందర్భంగా తేల్చిచెప్పారు. తరచూ విదేశాలకు, గోవాలకు ఎందుకు వెళ్ళారని ఆమెను సిట్ అధికారులు ప్రశ్నిస్తే ఆమె ఈ తరహ సమాధానాలను ఇచ్చారని సమాచారం. స్వేచ్చ జీవినని కూడ ఆమె చెప్పారు.
సెల్టవర్ లోకేషన్ల ఆధారంగా విచారణ చేసుకోండి
కెల్విన్ ఫోన్లో తనకు సంబంధించిన నెంబర్ ఉన్న విషయాన్ని సిట్ అధికారులు ముమైత్ఖాన్ను ప్రశ్నించారు. అయితే ఈ విషయమై కూడ ముమైత్ ఖాన్ అదే స్థాయిలో స్పందించారని తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీతో తనకు సంబంధాలు తగ్గిపోయినట్టు ఆమె చెప్పారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె బదులిచ్చారు. తన కాల్ డేటాలో ఉన్న నంబర్లు, తన ముంబై అడ్రస్ , సెల్టవర్ లోకేషన్ల ఆధారంగా విచారణ చేసుకోవాలని ఆమె సిట్ అధికారులకు చెప్పారని ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
నోరు విప్పలేదు
ఓ తెలుగుటీవి ఛానెల్ నిర్వహిస్తున్న రియాలిటీ షో లో ఆమె పాల్గొంటున్నారు. అక్కడి నుండే నేరుగా ఆమె విచారణకు హజరయ్యారు. అయితే ఆమెతోపాటు నలుగురు వ్యక్తులు కూడ విచారణ ప్రాంతానికి చేరుకొన్నారు. రియాలిటీ షో నిబంధనల ప్రకారంగానే ఆమె ఫోన్లు మాట్లాడలేదు. ఈ షో గురించి ఇతరులకు విషయాలను షేర్ చేయలేదు.
ఈవెంట్ మేనేజర్గానే తెలుసు
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించానని ముమైత్ఖాన్ చెప్పారు. అయితే కెల్విన్ ఈవెంట్ మేనేజర్గా వరిచయం అయ్యారు. సినీ పరిశ్రమలో బడా నిర్మాతలు, హీరోలు దర్శకులతో పదే పదే కన్పించడం వల్ల తనకు పరిచయమయ్యాడని ఆమె సిట్ అధికారులకు వివరించారు. ఈవెంట్ మేనేజ్మెంట్లు నిర్వహించడం వల్ల తనకు కెల్విన్ నుండి ఫోన్లు వచ్చేవని ఆమె సిట్ అధికారులకు వివరించినట్టు చెప్పారు. అంతకుమించి డ్రగ్స్ తీసుకోవడం అనేది తనకు తెలియదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Search
-
అమెజాన్ డిస్కౌంట్ అమ్మకానికి ఈ లింక్ క్లిక్ చేయండి Click this link for Amazon Discount Sales https://whatyourbuy.in/amazon-discount-finde...
-
In today's Presidential election, 4,895 legislators across the country - parliamentarians and legislators - voted. The National Democr...
-
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ తాజా ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా ...
-
పబ్లిసిటీకి డిఫరెంట్ ఐడియాలను అప్లై చేస్తున్నారు మూవీ మేకర్స్. కొలవెరి తర్వాత ఈ...
-
విజయవాడ: నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని ఇళ్ల నుంచి పారిపోయి వ...
-
Amazon is continuing its international expansion push with the launch of its services in Singapore coming imminently. The arrival could ...
-
రుద్రమదేవి..సెప్టెంబర్ నాలుగున విడుదల కావాల్సిన సినిమా. అనివార్య కార...
-
యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'రేయ్' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ పలు కట్స్ ఇచ్చినట్టు తెలుస...
-
The high and mighty of Bollywood were at their juvenile worst on Sunday. It was a shocking and sad moment during the recently-concluded II...
Akshith Nihaal. Powered by Blogger.
0 comments:
Post a Comment