http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 18 July 2017

On 11:37 by Unknown   No comments
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పదవికి సోమవారం రాత్రిపూట వెంకయ్యనాయుడు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు మంగళవారంనాడు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికైతే ఆ పదవికి ఎన్నికైన మూడో తెలుగువాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడిని ఎన్‌డిఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది బిజెపి. ఈ మేరకు ఎన్‌డిఏ భాగస్వామ్యపక్షాలతోపాటు ఇతర పార్టీలు కూడ తమ ఆమోదాన్ని తెలిపాయి.
అయితే కేంద్రమంత్రి పదవికి వెంకయ్యనాయుడు సోమవారం రాత్రిపూట రాజీనామా సమర్పించారు.బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహ, పలువురు కేంద్రమంత్రులు, బిజెపి సీనియర్లు వెంకయ్యనాయుడును అభినందించారు.
ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ముందే ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయాల్సి ఉన్న కారణంగానే ఆయన రాజీనామా చేశారని పార్టీ వర్గాలు చెబతున్నాయి.
ఎన్నిక లాంఛనమేనా?

ఎన్నిక లాంఛనమేనా?

ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు ఎన్నిక లాంఛనమేననే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. యూపీఏ తరపున గోపాలకృష్ణగాంధీని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. అయితే వ్యూహత్మకంగానే కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. అయితే బిజెపి మాత్రం నామినేషన్లకు ఒకరోజు ముందుగా అభ్యర్థిని ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని బిజెపి ప్రకటించింది. వ్యూహాత్మకంగానే వెంకయ్యపేరును బిజెపి ప్రకటించిందనే అభిప్రాయం ఉంది. ఎన్‌డిఏకే బలం ఎక్కువగా ఉన్నందున రాష్ట్రపతి ఎన్నికల్లో వచ్చే ఫలితమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడ పునరావృతమయ్యే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov