http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 20 July 2017

On 12:10 by Unknown   No comments
భారత 14వ రాష్ట్రపతి ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. నాలుగు టేబుళ్లపై మొత్తం ఎనిమిది రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. మొదటిగా పార్లమెంట్‌ భవనంలో ఎంపీలు ఓట్లు వేసిన బ్యాలెట్‌ పెట్టెను, తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల బ్యాలెట్‌ పెట్టెలను తెరిచి ఓట్లు లెక్కించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనూప్‌ మిశ్రా చెప్పారు.

కాగా, ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు తథ్యమని ఇప్పటికే అందరూ భావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. ఆయన స్థానంలో నేటి ఫలితాల్లో విజయం సాధించే అభ్యర్థి రాజ్ భవన్‌లో 14వ రాష్ట్రపతిగా అడుగుపెడతారు. కోవింద్‌ గెలుపు లాంఛనమే అయినప్పటికీ.. ఎంత మెజార్టీతో గెలుస్తారా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov