http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 13:42 by Unknown   No comments
nithish
ప్రభుత్వంలో చేరిన బీజేపీ
డిప్యూటీ సీఎంగా సుశీల్‌ మోడీ
కేంద్రంలో జేడీ(యూ) చేరే అవకాశం
నితీష్‌పై లాలూ నిప్పులు
కలిసి పనిచేద్దామన్న ప్రధాని మోడీ
అంతా స్వార్థమే : రాహుల్‌
బీహార్‌లో మళ్లిd ఎన్డీయే సర్కారు కొలువు తీరింది. ఆరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ గురువారం ప్రమాణం చేసారు. ఊహించినదానికంటే వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయమే గవర్నర్‌కు జేడీ(యూ), బీజేపీలు మద్దతు లేఖలు సమర్పిస్తాయని, సాయంత్రానికి నితీశ్‌ ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిం చినా మరింత వేగంగా పరిణామాలు చోటు చేసు కున్నాయి. అర్థరాత్రే ఇరు పార్టీలు గవర్నర్‌కు మద్దతు లేఖలు సమర్పించాయి. ఆయన వెం టనే నితీశ్‌ ప్రమాణ స్వీకారానికి అనుమతిం చారు. రెండు రోజుల్లో బలనిరూపన చేసుకోవా లని ఆదేశించారు. తెల్లారగానే జరిగిన పరిణామాల్లో నితీశ్‌ గరువారం ఉదయం 10 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం చేయగా, మరింత ఆశ్యర్యం గొలిపే విధంగా బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరింది. బుధవారం సాయం త్రం వరకూ బయటి నుంచి మద్దతు ఇస్తామని చెబుతూ వచ్చిన పార్టీ నుంచి గురువారం ఉదయం సుశీల్‌కుమార్‌ మోడీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా సీఎం నితీశ్‌ తరువాత ప్రమాణ స్వీకారం చేసారు. దీంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ జేడీ(యూ) చేరుతుందన్న ప్రచారం ఊపందుకుంది. అందుకు తగినట్లుగానే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పార్లమెంటు ఉభయసభల్లోనూ ఎన్డీయేకు మద్దిస్తామని చెప్పారు. దీంతో బీహార్‌లో ఎన్డీయే మళ్లిd పూర్తి స్థాయిలో ఏర్పడింది. రాష్ట్రంలోనూ కేంద్రం లోనూ ఎన్డీయేకు ఉనికి వచ్చేసింది. అయితే.. అధి కారం చేపట్టిన జేడీ(యూ)లోనే లుకలుకలు లేక పోలేదు. నితీశ్‌ తన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో మంతనాలుజరుపుతుండగానే ఆ పార్టీ సీనియర్‌ నేత శరద్‌యాదవ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానంతోనూ ఆర్జేడీ నాయకులతోనూ భేటీ అయ్యారు. తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. మరో ఎంపీ అలీ అన్వర్‌ కూడా నితీశ్‌ను సమర్థిస్తానని చెబుతూనే ఆర్జేడీతో బంధం తెంచుకోవడాన్ని తెగనాడారు. ఈ విషయం లో నితీశ్‌తో ఏకీభవించలేకపోతున్నానన్నారు.
వీరికి తగినట్లుగానే లాలూ పార్జీ ఆర్జేడీ స్పందిం చింది. రాష్ట్ర అసెంబ్లిdలో అతి పెద్ద పార్టీ అయిన తమను కాదని జేడీ(యూ)కు ఎలా అవకాశమిస్తారని గవర్నర్ను ప్రశ్నించింది. ఈ విషయమై సుప్రీంలో కేసు వేస్తానని లాలూ ఇప్పటికే హెచ్చరించారు. తమకు అవకాశమిస్తే చాలా మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలు తమకు ఓటు వేస్తారని, అప్పుడు తామే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని లాలూ వాపోయారు. రాత్రంతా జేడీ (యూ) ఎమ్మెల్యేలను ఎందుకు బంధించి ఉంచారని, వారెక్కడ తమను చేరుకుంటారోనన్న భయంతోనే దాచి ఉంచారని నితీశ్‌పై తేజస్వి ఆరోపించారు. ఈ సందర్భంగా బంధం తెగదెంపులు కాగానే మూడు నెలల నుంచి తెరవెనుక జరుగుతున్న పరిణామాలను ప్రత్యర్తి వర్గాలు బయటపెట్టుకుంటున్నాయి. మూడు నెలల నుంచి లాలూ కుటుంబాన్ని కేసుల్లో ఇరికించడానికి నితీశ్‌ కేంద్రంతో కుమ్మక్కయ్యారని, అందుకు పలితమే తమపై సీబీఐ, ఈడీ కేసులని, రాజీనామా చేయకుండా కూటమి చట్టుబండలు కావడానికి కారణమైన తేజస్వి యాదవ్‌ ఆరోపించారు. లాలూ కూడా ఇదే విధంగా విలేకరుల సమావేశంలో మాట్లా డారు. కాగా.. మే నెలలోనే లాలూ తరపున ఆర్జేడీ నాయకులు కేంద్ర మంత్రులను కలిసి మంతనాలాడా రని, తమను సీబీఐ కేసుల్లో చూసీ చూడనట్లు వదిలేస్తే నితీశ్‌ సర్కారును కూలదోసేందుకు కూడా వెనకాడ మని వారు బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారని జేడీ (యూ) ప్రధాన కార్యదర్శి త్యాగి ఆరోపించారు. లాలూ ఆరోపణలు మానుకోవాలని, ఆర్జేడీతో కలిసి పని చేయలేని పరిస్థితుల్లోనే తాము బీజేపీతో జతకట్టామని, ఆర్జేడీ కంటే బీజేపీతో కలిసి పని చేసినప్పుడే పాలనలో పారదర్శకత ఉందని ఆయన వివరించారు. ఇంత జరుగుతున్నా.. నితీశ్‌ మాత్రం బీహార్‌ అభివృద్ధి కోసమే బీజేపీతో జత కట్టానని, అవకాశం వచ్చినప్పుడు అన్ని విషయాలపై స్పంది స్తానని ప్రకటించారు. నితీశ్‌ ప్రమాణం తరువాత మోడీ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేయడం నితీశ్‌. మోడీల మధ్య తిరిగి చిగుర్చిన బంధాన్ని తెలియజేస్తోంది. సీఎం నితీశ్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోడీ కూడా వేదికపై కలుపు గోలుగా మాట్లాడుకుంటూ నవ్వుల పువ్వులు పూయిస్తు తమ పాత స్నేహాన్ని మరిపించారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov