http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 17 April 2015

On 17:58 by Unknown   No comments
Rajendra prasad MAA
తనను అభిమన్యుడిలా అంతం చేద్దామనుకున్నారని, కానీ తాను నటకిరీటిని కాబట్టి అర్జునుడిలా విజయం సాధించానని ''మా'' అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖ హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాము పంచపాండవుల్లా ఐదుగురిమే బరిలోకి దిగామని, వాళ్లు మాత్రం కౌరవుల్లా వచ్చారని ఎద్దేవా చేశారు.

ఎన్నో పరీక్షలు దాటుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. మా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు.  
 
సినిమా కళాకారులందరూ నవ్వుతూ బతకాలన్నదే తన కోరిక అన్న రాజేంద్ర ప్రసాద్... ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. తన విజయాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov